విశాఖపట్నం(Padmanabham): పద్మనాభం మండల కేంద్రంలోని మండల కాంప్లెక్స్ ఆవరణలో ఈ నెల 20వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao) ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అనంత పద్మనాభస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. పద్మనాభంలో కొలువైన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి వైభవం విశిష్టత అనే అంశంపై చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఇప్పటికే నిర్వాహక కమిటీ విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసారు.






